క్రిస్మస్ కిరణాలు - క్రిస్మస్ నాటిక - 5వ రంగము
5వ రంగము (చివరిరోజు ఉజ్జీవ కూటము అప్పటివరకు కొంత వాక్యము చెప్పినట్లుగా నటించాలి. ఈ కూటముల ద్వారా మేలు పొందిన రోగులు సాక్ష్యములు చెప్పాలి) పాస్టరు గారు: ప్రభువునందు ప్రియులారా ఈ మూడు దినములు ఉజ్జీవ సభల ద్వారా మేలు పొందినవారు దయచేసి మీ సాక్ష్యములు చెప్పి ప్రభువును మహిమపరచండి. ఆగస్టీన్: (నిలవబడి) అయ్యా నా పేరు ఆగష్టీనండి. మాది వెలగలేరండి. 25సం.లు అలసర్ వ్యాధితో నొప్పి , బాధ అనుభవించాను. ముదునూరుపాడు , గోటేరు వెళ్లానండి అయినా తగ్గలేదు , మందులు పనిచేయలేదు. ఈ పాష్టరు గారు కత్తి పడవేసి , పాపములు ఒప్పుకోమన్నారు. కత్తి పడవేసాను. శత్రువులతో సమాధానపడ్డాను. రోగం పోయింది. దేవునికి స్తోత్రం. (అందరూ హల్లెలూయ చెప్పాలి) జఖరయ్య: అయ్యా నా పేరు జఖరయ్యండి. మా ఊరు మార్టేరండి. నేను పనిచేసే దొరగారి సంస్థ నుండి కొన్ని దొంగ వస్తువులు తెచ్చి నా పిల్లలకు పెట్టుటవలన వారు గజ్జి , జ్వరాలతో రెండు సం.ల నుండి బాధపడ్డారు. పాష్టరు గారు చెప్పినట్లు నా పాపము సరిచేసుకొని దొరగారి దగ్గర ఒప్పుకున్నాను. గజ్జి , జ్వరాలు తగ్గిపోయాయి. దేవినికి స్తోత్రం. సుందరమ్మ: అందరికీ వందనాలండి. నా పేరు సుందరమ్...